మోడీ, ట్రంప్ లతో సెల్ఫీ దిగిన ఆ కుర్రాడు ఎవరో తెలుసా..?

-

సెల్ఫీ,. ఇప్పుడు దీని క్రేజ్ అంతా ఇంతా కాదు.. నలుగురు కలిస్తే చాలు గుర్తుగా ఓ సెల్ఫీ.. విందైనా, వేడుక అయినా సెల్ఫీ తప్పనిసరి అయ్యింది. ఇక ప్రముఖులతో సెల్ఫీ దిగితే వెంటనే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయాల్సిందే. ఎంత పెద్ద సెలబ్రెటీతో సెల్ఫీ దిగితే అంత గ్రేట్..

మరి అలాంటిది ఏకంగా ప్రధాని మోడీతోనే సెల్ఫీ దిగితే.. ఆ సెల్ఫీలో ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా ఉంటే.. వావ్.. ఎంత లక్కీయో కదా.. తాజాగా అమెరికాలోనిహూస్టన్ లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ప్రధాని మోడీ , డొనాల్డ్ ట్రంప్ తో ఓ లక్కీ బోయ్ సెల్ఫీ తీసుకున్న సంగతి బాగా వైరల్ గా మారింది.

అప్పటి నుంచి ఆ బాలుడు ఎవరా అన్న డిస్కషన్ సోషల్ మీడియాలో మొదలైంది. ఎవరా కుర్రాడు.. అక్కడ ఎందుకు ఉన్నాడు.. అనేది ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎట్టకేలకు ఆ అన్వేషణ ఫలించింది. ఆ కుర్రాడి వివరాలు తెలిశాయి. ఈ కుర్రాడు మన పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన 13 ఏళ్ల సాత్విక్ హెగ్డేగా గుర్తించారు.

మరి ఈ కుర్రాడు అక్కడ ఎందుకు ఉన్నాడంటారా.. మనోడు యోగా స్పెషలిస్టు అట. ఆ హౌడీ మోడీ కార్యక్రమంలో సూర్యనమస్కారాలు ప్రదర్శించేందుకు వచ్చాడట. ప్రసంగాలకు ముందు అగ్రనేతలిద్దరూ నడుచుకుంటూ వస్తున్న సమయంలో అక్కడే ఉన్న సాత్విక్ ఇరు దేశాధినేతలతో కలిసి సెల్ఫీ తీసుకున్నాడు.. ఒక్క పూటలోనే సెలబ్రెటీ అయిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news