అమ్మో : ఏకంగా ఏటీఎంనే మాయం చేసేశారు !

-

ఈ మధ్య కాలంలో తెలంగాణ జిల్లాలో ఏటీఎం దొంగలు ఎక్కువయి పోయారు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా దొంగతనం చేస్తున్నారో పోలీసులకు అంతు చిక్కడం లేదు. గతంలో ఏటీఎంలను దోచుకోవడానికి ప్రయత్నించినా సఫలం అయ్యే ఘటనలు మాత్రం చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు వాళ్ళు ట్రెండ్ మార్చి ఏటీఎం ధ్వంసం చేయకుండా ఏటీఎం సహా ఎత్తు కెళ్లి పోవడం ప్రారంభించారు. తాజాగా అలానే ఆదిలాబాద్ లో ఉన్న ఎస్ బి ఐ ఎటిఎం మొత్తాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.

కలెక్టరేట్ చౌరస్తాలో ఉన్న ఏటీఎం ని దొంగల ముఠా మాయం చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆదిలాబాద్ లోనే ఉన్న మరో జ్యువలరీ షాప్ లో కూడా దొంగతనానికి ఈ ముఠా విఫలయత్నం చేసినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పోలీసులు జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news