బానిస అంటే తోలు తీస్తా..సీతక్క వార్నింగ్..!

-

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు రాఖీ కట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు రాఖీ కట్టడం పై టిఆర్ఎస్ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. దాంతో తాజాగా ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. తను చంద్రబాబుకు కొత్తగా రాఖీ కట్టడం లేదని గత 15 ఏళ్ల నుండి చంద్రబాబుకు రాఖీ కడుతూ వస్తున్నాను అని చెప్పారు. ఆనవాయితీ పోగొట్టుకోవద్దని ఆచారాన్ని కాపాడుకోవాలని రాఖీ కడుతున్నట్టు సీతక్క అన్నారు.

దీన్ని కూడా రాజకీయం కోసం వాడుకోవడానికి సిగ్గు ఉండాలి అని సీతక్క మండిపడ్డారు. తనను అంటున్నారని అలా అంటే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉండగా గతంలో సీతక్క టిడిపిలో లో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో చంద్రబాబుతో సీతక్క కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతియేటా చంద్రబాబుకు రాఖీ కడుతూ వస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి కి కూడా సీతక్క రాఖీ కట్టారు. ఇక ప్రస్తుతం సీతక్క కాంగ్రెస్ లో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. రేవంత్ తరవాత తెలంగాణ కాంగ్రెస్ లో ఆ స్థానం సీతక్క దే అని కూడా విశేషకులు అభిప్రాయపడుతున్నారు.A

Read more RELATED
Recommended to you

Latest news