సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ముగ్గురు డైరెక్ట‌ర్ల సెల్పీ..!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు. బాస్ ఈజ్ బ్యాక్ అని ఖైదీ నెంబర్ 1 సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు.ఆ సినిమా తర్వాత ఆచార్య సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.సినిమా షూటింగ్ పూర్తి కాకముందే కరోనా వైరస్ పుణ్యమా అని అదికాస్తా వాయిదా పడింది. అయినా గాని మెగాస్టార్ లో జోరు తగ్గలేదు. వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు రెడీ అయిపోయాడు.వ‌చ్చే ఏడాది మాత్రం ఫుల్ జోష్ రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే లూసిఫ‌ర్ , వేదాల‌మ్ రీమేక్ లకు చిరు ఓకే చెప్పాడు. తాజాగా వెంకీమామ సినిమాకు డైరెక్ట‌ర్ అయిన బాబీ తో కూడా ఓ చిత్రాన్ని చేసేందుకు రెడీ అవుతున్నాడు చిరు. లూసిఫ‌ర్ రీమేక్ కు వివి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా. వేదాళ‌మ్ రీమేక్ ను మెహ‌ర్ ర‌మేశ్ డైరెక్ట‌ర్ చేయ‌నున్నాడు.అయితే ఈ ముగ్గురు డైరెక్టర్లు ఇప్పుడు వి వి వినాయక్ పుట్టినరోజు కారణంగా ఒకేచోట కలిసి సందడి చేస్తున్నారు.

ఈరోజు వినాయక్ పుట్టినరోజు సందర్బంగా మెహ‌ర్ ర‌మేశ్‌, బాబీ ఆయ‌న ఇంటికెళ్లి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. వినాయ‌క్ తో క‌లిసి ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు సెల్ఫీ దిగారు.ఇక్కడ గమనించాలిసిన విషయం ఏంటంటే ఈ ముగ్గురికి చిరంజీవి అంటే చెప్పలేనంత అభిమానం. ఒక విధంగా చెప్పాలంటే వీరాభిమానులే. అలాగే ముగ్గురు కూడా చిరంజీవి సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. మెగాస్టార్ తో సినిమాలు చేయ‌నున్న‌ ముగ్గురు డైరెక్ట‌ర్ల సెల్పీ ఇపుడు సోష‌ల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.. !!

Read more RELATED
Recommended to you

Latest news