దారుణం.. ర్యాగింగ్ పేరిట 150 మంది విద్యార్థుల‌కు సీనియ‌ర్లు గుండు కొట్టించారు..!

-

పాఠ‌శాల స్థాయిని వీడి క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థుల‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే భూతం.. ర్యాగింగ్.. ఈ ర‌క్క‌సి వ‌ల్ల ఎంతో మంది చ‌దువుకు గుడ్‌బై చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి.

పాఠ‌శాల స్థాయిని వీడి క‌ళాశాల‌ల‌కు వెళ్లే విద్యార్థుల‌కు స‌హ‌జంగానే ఎదుర‌య్యే భూతం.. ర్యాగింగ్.. ఈ ర‌క్క‌సి వ‌ల్ల ఎంతో మంది చ‌దువుకు గుడ్‌బై చెప్పిన సంద‌ర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ కాలేజీల్లో జ‌రిగే ర్యాగింగ్ మ‌రింత వికృతంగా ఉంటుంది. సీనియ‌ర్లు జూనియ‌ర్ల‌పై ర్యాగింగ్ పేరిట నీచ‌మైన అకృత్యాల‌కు పాల్ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా అలాంటి ఓ ఘ‌ట‌నే ఆ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

senior students shaved 150 juniors heads of ragging

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని స‌ఫాయిలో ఉన్న ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీలో సీనియ‌ర్ విద్యార్థులు జూనియ‌ర్ స్టూడెంట్స్‌పై ర్యాగింగ్‌కు పాల్ప‌డ్డారు. వారిని అనేక విధాలుగా వేధించారు. అది కూడా స‌రిపోద‌ని చెప్పి ఆ విద్యార్థులంద‌రికీ గుండ్లు కొట్టించారు. మొత్తం 150 మంది జూనియ‌ర్ స్టూడెంట్స్‌కు సీనియ‌ర్ విద్యార్థుల గుండ్లు గీయించి కాలేజీ క్యాంప‌స్ మొత్తం తిప్పించారు. వారిచేత దండాలు పెట్టించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆ విద్యార్థులు గుండ్ల‌తో కాలేజీకి వెళ్తున్న ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ఈ విష‌యం తెలుసుకున్న ఆ కాలేజీ వైస్ చాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. త‌మ కాలేజీలో ఇప్ప‌టికే ర్యాగింగ్‌ను నియంత్రించేందుకు ఓ క‌మిటీని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ ర్యాగింగ్‌కు పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. బాధిత విద్యార్థులతోపాటు ఇత‌ర జూనియ‌ర్ విద్యార్థులు ఈ విష‌యంలో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని, వారు ర్యాగింగ్ బారిన ప‌డితే వెంట‌నే ర్యాగింగ్ క‌మిటీని ఫిర్యాదు చేయాల‌ని ఆయ‌న తెలిపారు. కాగా సోష‌ల్ మీడియాలో ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌న‌మే క‌లిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news