జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

-

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్‌పై ఎమ్మెల్యే హరీష్ రావు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.మంగళవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జస్టిస్ నర్సింహా రెడ్డి పవర్ కమిషన్ నిష్పక్షపాతంగా విచారణ జరపడం లేదని అన్నారు .ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఆయన విచారణకు హాజరుకాకముందే కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్‌పై అబాంఢాలు వేశారని మండిపడ్డారు.

నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే జస్టిస్ నర్సింహా రెడ్డి పవర్ కమిషన్ నుండి స్వచ్ఛదంగా వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే . ఈ క్రమంలో జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ అప్పటి సీఎం కేసీఆర్ నోటీసులు ఇవ్వగా కేసీఆర్ ఘాటుగా ఆన్సర్ ఇచ్చారు. జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ విచారణ సరిగ్గా జరపడం లేదని, కమిషన్‌ నుండి జస్టిస్ నర్సింహా రెడ్డి తప్పుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తాజాగా హరీష్ రావు అవే కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news