అత్త గారు ఆస్తి ఇవ్వలేదని అమ్మని చంపేసాడు…!

-

చాలా మంది అమ్మను దైవంగా చూస్తూ ఉంటారు. ఆ అమ్మ లేనిదే మనకు జీవితం లేదు. అయితే ఒక కసాయి కొడుకు మాత్రం ఆస్తి ఇవ్వలేదని కన్న తల్లిని చంపేసాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్‌ పంచాయతీ రామదాసుపేటలో నివాసం ఉండే రామకృష్ణ… రోజువారీ కూలీగా చికెన్ షాపులో పని చేస్తున్నాడు.

అతడి తల్లి అనసూయమ్మకు పలాసలో మూడు ఇళ్ళు ఉన్నాయి. అయితే అవి అతని అత్తగారి ఆధీనంలో ఉన్నాయి. ఇళ్ళను తనకు ఇవ్వాలని అత్తగారితో అతను ఎప్పుడు గొడవ పడుతూ ఉండే వాడు. దీనికి అతని తల్లి కూడా మద్దతు పలుకుతూ వచ్చేది. ఈ విషమై తల్లీ కొడుకుల మధ్య పలు మార్లు వాగ్వాదం కూడా జరిగింది. అయిఆ సరే అతని తల్లి మాత్రం అంగీకరించలేదు.

బుధవారం కూడా ఇదే విధంగా అతని తల్లిని ఆస్తి కావాలని అడిగాడు. అయినా సరే ఆమె అంగీకరించలేదు. దీనితో కన్నతల్లిని మంచంకోడుతో కొట్టగా ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. బుధవారం జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news