సీఎం స్టాలిన్‌కు హైకోర్టులో ఊరట.. 18 కేసులు కొట్టివేత

-

మద్రాసు హై కోర్టు లో తమిళనాడు సీఎం స్టాలిన్‌ కు భారీ ఊరట లభించింది. పరువు నష్టం దావాలకు సంబంధించిన 18 కేసులను రద్దు చేస్తూ.. మద్రాసు హై కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వాన్ని, సీఎం ను, సీనియర్‌ అధికారులు, మంత్రులపై అప్పటి ప్రతి పక్ష నేత స్టాలిన్‌ అనేక ఆరోపణలు చేశారు.

దీంతో ఆయన మీద అన్నాడీఎంకే పాలకులు 18 పరువు నష్టం దావా కేసులు వేశారు. విమర్శలు, ఆరోపణలు చేసే హక్కు ప్రతి పక్ష నేతగా తనకు ఉందని.. ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో సీఎం స్టాలిన్‌ కోర్టు లో పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ పై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. అదే సమయంలో డీఎంకే అధికారంలోకి రావడం, సీఎం గా స్టాలిన్‌ పగ్గాలు చేపట్టడంతో.. కేసులను ఉప సంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పిటీషన్‌ విచారణను ముగించిన న్యాయమూర్తి నిర్మల్‌ కుమార్‌ తాజాగా తీర్పు కూడా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news