బాలుడిపై లైంగిక వేదింపులు..ఆయాకు కఠిన శిక్ష విధించిన కోర్టు..!

-

ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆయాకు కఠిన శిక్షణ విధించింది బాలమిత్ర కోర్టు. 2017 లో హైదరాబాద్ పాతబస్తీలో ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న తొమ్మిదేళ్ళ బాలుడిని అదే స్కూల్ లో ఆయాగా పనిచేస్తున్న 25ఏళ్ల యువతి లైంగికంగా వేధించింది. దాంతో ఆ బాలుడు తల్లితండ్రులకు ఫిర్యాదు చేశాడు. తల్లి దండ్రులు ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆయాను విచారించారు.

తగిన ఆధారాలను సేకరించి కోర్టుకు సమర్పించారు. కాగా తాజాగా ఈ కేసులో బాలమిత్ర కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గానూ సదరు యువతికి ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 10 వేలు జరిమానా కూడా విధించింది. ఇక ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. మహిళలపై నే కాకుండా పురుషుల పై కూడా లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చట్టాలు అమలు చేస్తారని ఈ కేసుతో అర్థం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news