60ల్లో బాలయ్య బాబు రియలైజ్ అయ్యారా..?

-

నందమూరి వారసుడు నటసింహ బాలకృష్ణ మొన్నటి వరకు అడపాదడపా సినిమాలో చేసి ఫ్లాప్ లను చూసిన ఆ తర్వాత తన తండ్రి బయోపిక్ తీసి వరుసగా ప్లాప్ లను చూశాడు.. కానీ అలు పెరగని బాటసారిలా అఖండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరొకసారి సంచలనం సృష్టించిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్య కు పోటీగా నిలబడ్డారు. ఈ సినిమా కూడా బాలయ్య క్రేజ్ అమాంతం పెంచేసింది. ఇప్పుడు అదేదోవలోనే ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో కూడా ఫుల్ రక్తి కట్టించింది. ఈ షోలో బాలయ్య ఎపిసోడ్ వచ్చిందంటే సర్వర్ క్రాష్ అయిపోతుంది.

ఇలాంటి సమయంలోనే బాలయ్య మరొక అడుగు ముందుకు వేశాడు.. పెరుగుతున్న తన బ్రాండ్ వాల్యూ ప్రకారం కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.. మొన్న సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ యాడ్ , నేడు వేగా జువెలరీస్ ప్రకటన చేశారు. 60ల్లో కూడా బాలయ్య ఇంతలా రియలైజ్ అవ్వడానికి కారణం తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద మీడియా ప్రకటనల సంస్థ అయిన ఏజెన్సీ శ్రేయస్ మీడియా అని తెలుస్తోంది . ఈ సంస్థ చాలా పెద్ద ఎత్తున ప్రకటనలను మీడియా ఫీల్డ్ లో సప్లై చేస్తోంది.ఈ సంస్ధ అధినేత శ్రీనివాస్ కి బాలయ్య చాలా దగ్గర వ్యక్తి కావడంతో వేగా జ్యువెలరీ ప్రకటన కోసం బాలయ్య ముందుకు వచ్చారని సమాచారం.

మొత్తానికైతే గతంలో బాలయ్య ఎప్పుడు కూడా టీవీ షోలో కానీ ప్రకటనలో కానీ కనిపించలేదు. కానీ తన తోటి హీరోలు చక చక 4 బ్రాండ్స్ కి ఎండార్స్ చేస్తుంటే ఆయన మాత్రం ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు బాలకృష్ణ తన తీరును మార్చుకొని.. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికి ఒప్పుకుంటూ 60ల్లో కూడా బిజీగా మారిపోయారు బాలయ్య.

Read more RELATED
Recommended to you

Latest news