రాజీవ్ గాంధీని కలిశానంటూ నోరు జారిన షర్మిల..!

-

ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ కొనసాగుతుంది. ఎవ్వరూ ఏదైనా పొరపాటున నోరు జారితే ఇక అంతే సంగతులు. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలపై సోషల్ మీడియాలో భారీగానో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు కారణంగా.. రాజీవ్ గాంధీని కలిశానని షర్మిల నోరు జారడమే ఇందుకు కారణం అసలు ఏం జరిగిందంటే వైఎస్ షర్మిల తన పార్టీనీ కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో ఈమె భేటీ అయ్యారు. 10 జనపథ్ లోని సోనియాగాంధీ నివాసానికి వెళ్లిన షర్మిల.. దాదాపు 30 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశం జరిగిన అనంతరం మీడియాతో మాట్లాడిన వై.ఎస్.షర్మిల.. సోనియాగాంధీని, రాజీవ్ గాంధీని కలవడం జరిగిందని తెలిపింది. చాలా నిర్మాణాత్మక చర్చ జరిగింది. తెలంగాణ ప్రజలకు మేలు చేసే దిశగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. మీ అందరితో ఒకే విషయం చెబుతున్నా..కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైందని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news