వాళ్ళ ఇద్దరికీ ఓట్లు వేస్తే.. డ్రైనేజీలో వేసినట్టే: షర్మిల

-

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఏపీపీఎస్సీ చీఫ్ షర్మిల విజయవాడలో పర్యటించారు. విజయవాడలోని కృష్ణలంక లో జరిగిన కార్నర్ మీటింగ్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో షర్మిల సంచలన కామెంట్స్ చేశారు ఆ రెండు పార్టీల మీద నిప్పులు చెరిగారు సభలో షర్మిల మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జగన్ బిజెపిని పట్టుకుని వేలాడుతున్నారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు.

వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఎక్కడా లేదని ఆ దుస్థితి ఒక మన రాష్ట్రానికి వచ్చిందని షర్మిల అన్నారు. ఈ పరిస్థితికి కారణం వైసిపి టిడిపి అని మండిపడ్డారు. వీళ్ళిద్దరికీ ఓట్లు వేస్తే డ్రైనేజీలో వేసినట్లు అని ఆమె కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్టుల పార్టీల అభ్యర్థులని గెలిపించాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news