ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: డీకే అరుణ

-

ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కి ఓట్లతో బుద్ధి చెప్పాలని బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ చెప్పారు. నియోజకవర్గంలోని మాగనూరు మండలం లో వడ్వాట్ గ్రామంలో గురువారం బిజెపి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మక్తల్ నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు కొండయ్య ఆధ్వర్యం లో బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రచారాన్ని మొదలుపెట్టారు.

అంతకు ముందు అరుణకి మదాసి కురవ సంఘం సభ్యులు వల్ల సంప్రదాయం ప్రకారం గొంగళి కప్పి సన్మానించి గొర్రె పిల్లని బహుకరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు కి చేతకాని వారికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు ప్రజా సంక్షేమ పథంలో మోడీ ప్రపంచానికి ఆదర్శమని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news