షాకింగ్: చికెన్ కొనడానికి వెళ్లి ఆరుగురుని నరికేసాడు

-

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక దారుణం జరిగింది. 30 ఏళ్ల కార్మికుడు ఒకరు చికెన్ కొనడానికి వెళ్లి ఆరుగురుని నరికాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే… గణేష్ అనే వ్యక్తి… మాంసం కొనడానికి కాటన్‌ పేట్ ప్రాంతంలోని ఒక దుకాణానికి వెళ్లి, అక్కడి నుంచి కత్తి దొంగిలించి, పారిపోయి, ఆరుగురిని అత్యంత దారుణంగా నరికాడు. గాయపడిన వారిలో ఒక కూలీ ఆసుపత్రిలో మరణించారు.

మరొ ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రజలచే అప్రమత్తం కావడంతో, ఒక ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ ఆ ప్రాంతానికి చేరుకుని, ఆ వ్యక్తిని కార్నర్ చేసి, అతని నుండి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302 (హత్య), 307 (హత్యాయత్నం) కింద అతనిపై కేసు నమోదైందని, దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటో తెలియదని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news