స్టేజ్ పైనే ఆ హీరోతో అలాంటి పని చేసిన శ్రియ.. షాక్ లో ఫ్యాన్స్..!!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మొదటిసారిగా దర్శకుడిగా మారిన చిత్రం నువ్వే నువ్వే. ఇక ఈ సినిమాలో తరుణ్, శ్రీయ హీరో హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో..” అమ్మ ఆవకాయ అంజలి”.. ఎప్పుడు బోర్ కొట్టవు అన్న ఒక డైలాగ్ బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇకపోతే త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా అప్పుడే కాదు ఇప్పుడు.. అలాగే మరో పదేళ్ల తర్వాత చూసినా సరే ఈ సినిమా ఎప్పుడు ఫ్రెష్ గానే అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమా తెరకెక్కడానికి దర్శకుడు ఒక కారణం అయితే ..ఈ సినిమాలో అద్భుతంగా నటించిన తరుణ్, శ్రేయ కూడా మరో కారణమని చెప్పవచ్చు. నిన్నటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కి సంబంధించి ఒక ఈవెంట్ ను నిర్వహించారు. పాత స్మృతులను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా సినిమా యూనిట్ అంతా హాజరయ్యి తెగ సందడి చేశారు.

అసలు విషయంలోకి వెళితే.. తెలుగు సినిమాలలో ఒక మంచి హాస్య భరితమైన చిత్రంగా నువ్వే నువ్వే సినిమా నిలిచింది. ప్రతి సీన్ ప్రతి డైలాగ్ కూడా మనకు ఇప్పటికే గుర్తుండిపోయింది . అలాంటి ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన శ్రియ అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది. ” త్రివిక్రమ్, రవికిషోర్ గారు నా కోసం ఢిల్లీ వచ్చారు. ఈ కథ వినగానే నాకు బాగా నచ్చింది. షూటింగ్ చాలా ఎంజాయ్ చేశాను .తరుణ్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు.. ఈ సినిమా మర్చిపోలేని జ్ఞాపకం అని తెలిపింది.

ఆ తర్వాత తరుణ్ మాట్లాడుతూ.. శ్రియాలో పెద్దగా మార్పు ఏమి రాలేదు. కాకపోతే ఆమెకు పెళ్లయి, కూతురు ఉంది అని తెలిపాడు. దీంతో పెద్దగా నవ్వేసిన శ్రియ తన కో స్టార్ తరుణ్ ను స్టేజ్ పైనే అందరూ చూస్తుండగానే ముద్దు పెట్టేసింది. స్టేజ్ పై అలా ముద్దు పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ లోకి వెళ్ళిపోయారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news