మునుగోడు ఓటర్లకు ఫ్లైట్ టికెట్స్..ఎంత ఖర్చుకు వెనకాడని పార్టీలు

-

మునుగోడు ఉప ఎన్నిక తరుముకొస్తున్న నేపథ్యంలోనే.. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక అటు నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నెల 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబర్ 17 వరకు నామినేషన్లు పరిశీలించనున్నారు. అక్టోబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

అయితే.. మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు ఏ మాత్రం తగ్గడం లేదు. మునుగోడు ఓటర్లకు ఫ్లైట్ టికెట్స్ కూడా కొనుగోలు చేసేందుకు సిద్దం అయ్యాయి. విదేశాలు… వేరే రాష్ట్రంలో ఉన్న వారికి టికెట్స్ కొనుగోలు చేసి.. వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీలు. ఏ ఒక్క అవకాశం వదులుకోని పార్టీలు.. నియోజక వర్గంలో ప్రతి ఓటర్ ను కాంటాక్ట్ చేస్తున్నాయి పార్టీలు. ఓటు వేశాక తిరిగి పంపేందుకు విమాన టికెట్స్ ఖర్చుకు కూడా వెనకాడడం లేదు పార్టీలు. ఇక ఇదే ఆసరా చేసుకుని.. ఓటర్లు కూడా సొంత గ్రామానికి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news