మసీదులను తవ్వి చూద్దాం..ప్రధాని మోడీపై KTR ట్వీట్

-

తెలంగాణ మంత్రి కేటీఆర్… ఈ మధ్య కాలంలో.. ఎక్కువగా ట్విట్టర్‌ వేదికగా.. బీజేపీకి కౌంటర్లు ఇస్తున్నారు. బీజేపీ తప్పులను ఎత్తి చూపుతూ.. వారిపై సెటైర్లు వేస్తున్నారు కేటీఆర్‌. అయితే.. తాజాగా ప్రధాని మోడీని ఉద్దేశించి.. వివాదస్పద ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్.

మసీదులను తవ్వి చూడటం… ఆమోదయోగ్యమేనా? అని ప్రధాని మోడీని నిలదీశారు. ఒక మతాన్ని బహిష్కరించు, గాడ్సే దేశభక్తుడు, మసీదులను తవ్వి చూద్దాం, బిల్కిస్ బానో రేపిస్టులు సంస్కారవంతులు ఈ బిజెపి నేతల నుండి విచిత్రమైన ప్రకటనలు & ప్రధానమంత్రి మోడీ మౌనం ఆశ్చర్యంగా ఉందని ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌. మోడీ జీ, మీరు దేనిని అనుమతిస్తారో అది… మీరు ప్రోత్సహించడమే అని గుర్తుంచుకోండని చురకలు అంటించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news