వైసీపీలోకి శిద్దా.. చంద్రబాబుకి గట్టి షాక్..!

-

ప్రకాశం జిల్లా టీడీపీకి మరో గట్టి దెబ్బతగలబోతుంది. ఇప్పటికే ఆ జిల్లాకు చెందిన కరణం బలరాం కుమారుడు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. బలరాం వైసీపీ కండువా కప్పుకోకపోయినా… ఆయన అనధికారికంగా వైసీపీలో ఉన్నట్టే లెక్క. పైగా నిన్న ఆయన మాట్లాడుతూ టీడీపీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్తూనే చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. ఇప్పుడే అదే జిల్లాకి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు తన కుమారుడితో కలిసి రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. ప్రస్తుతం శిద్దా రాఘవరావు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. జాతీయ కోశాధికారిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి మాగుంట చేతిలో ఓడిపోయారు. ఇప్పటికే శిద్దా సోదరులు వైసీపీలో ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే శిద్దా పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. రేపు ఆయన పార్టీ మారబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news