జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్..!

-

బీజేపీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా సోకింది. ఆయన తల్లి మాధవి రాజే సింధియా కూడా కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వారిద్దరినీ తరలించారు. ఇద్దరూ జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఇద్దరికీ పరీక్షలు చేసిన వైద్యులు కరోనా సోకినట్లు నిర్దారించారు. జ్యోతిరాదిత్యలో కరోనా లక్షణాలు బయటపడగా ఆయన తల్లిలో మాత్రం ఎలాంటి లక్షణాలూ బయటపడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news