ఆంధ్ర ప్రదేశ్ లో అల్లర్లపై సిట్ ఏర్పాటు.. సభ్యులు వీరే!

-

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 సభ్యులతో ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఈ సిట్ పని చేయనుంది. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత పని చేయనున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్ స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్ స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాస్ సభ్యులుగా నియామకమయ్యారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై తుది నివేదికను సిద్ధం చేసి ఈసీకి పంపనున్నారు.ఈ నివేదిక ఆధారంగా అల్లర్ల కారకులపై కఠిన శిక్షలు అమలు అయ్యే అవకాశాలున్నాయి.

కాగా రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు రాళ్లు, రాడ్డు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడుల చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌గా స్పందించింది.పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అల్లర్లపై సిట్ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news