Tollywood: సీరియల్ నటుడు ఆత్మహత్య… ఆ నటితో అక్రమ సంబంధమే కారణమా ?

-

 

Tollywood: సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. మణికొండ లో ఆత్మహత్య చేసుకున్న చందు…త్రినయినితో పాటు పలు సీరియల్స్ లో నటించాడు. చందుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది నటి పవిత్ర. ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో వివాహేతర సంబంధం ఉందని సమాచారం అందుతోంది.

 

2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్నాడు చందు. రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నాడు చందు. అయితే సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి నేపథ్యంలో…. చందు తీవ్ర డిప్రెషన్ కి వెళ్ళాడట. ఆమె లేనిదే బతకలేనని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. చందు ఆత్మహత్య కు కారణాల పై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news