ఒకేసారి విషం తాగిన ఆరుగురు బాలికలు.. ముగ్గురి మృతి..

-

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఒకేసారి ఆరుగురు బాలికలు విషం తాగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. విషం తాగిన ఆరుగురు బాలికలలో ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఆరుగురు బాలికలు మంచి స్నేహితులు.అందులో ఓ బాలిక వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని సమాచారం. ఆ యువకుడు పెళ్ళికి నిరాకరించడం వల్ల మనస్తాపానికి గురైన బాలిక విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. మిగిలిన అయిదుగురు కూడా అదే బాటలో విషయం తాగేశారు. అయితే ముగ్గురు చనిపోగా మిగిలిన వారు మగధ్ మెడికల్ కళాశాలలలో చికిత్స పొందుతున్నారు.

కాస్మా ప్రాంతంలో ఆరుగురి బాలికలు నివాసం ఉండేవారు. బాలిక తన ప్రేమను తన స్నేహితురాల్ల ద్వారా యువకుడికి తెలియజేసింది. కానీ యువకుడు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆరుగురు బాలికలు తమ స్వగ్రామానికి వచ్చి విషం తాగేశారు. వీరందరి వయసు 12 నుండి 16 మధ్య ఉంది. అందరూ వేరు వేరు కుటుంబాలకు చెందినవారే. మిగతావారు ఎందుకు విషం తాగారు అనే కోణంలో విచారణ జరుపుతున్నామని ఔరంగాబాద్ ఎస్పీ కాంతేష్ కుమార్ మిశ్రా తెలిపారు. చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news