Breaking: జవహర్‌నగర్‌లో ఘోర విషాదం.. చెరువులో పడి ఆరుగురు మృతి

-

ఐదుగురు విద్యార్థులు చెరువు లో ఈతకు వెళ్లారు. అప్పడిదాక ఎంతో ఉత్సాహంగా ఈత కొట్టారు. చాలా సందడిగా గడిపారు. ఈత కొడుతూ కాస్త లోపలికి వెళ్లారు. అంతే.. నీటిలో మునిగిపోయారు. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా నీటిలో మునిగి మరణించాడు. ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లా జవాహర్ నగర్ లో చోటు చేసుకుంది.

జవహార్‌నగర్‌ పరిధిలో ఉన్న మల్కాపురంలోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో 5 మంది మదర్సా విద్యార్థులు, కాగా ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు. వీరంతా అంబర్‌పేటలోని మదర్సా విద్యార్థులుగా గుర్తించారు. చెరువులోకి ఐదుగురు విద్యార్థులు వెళ్లి ఈతకు వెళ్లి నీట మునిగారు.

విద్యార్థులను రక్షించేందుకు వెళ్లి.. ఉపాధ్యాయుడు కూడా నీటమునిగాడు. దుర్ఘటనలో మొత్తం ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు మృతి చెందారు. వీరంతా 12 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులేనని తేలింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version