అంగన్​వాడీ కేంద్రంలో పాము పిల్లల కలకలం.. ఏకంగా 30 ?

-

మామూలుగా ఒక పామును చూస్తే గుండె జలదరిస్తుంది. అలాంటిది ఏకంగా 30 పాము పిల్లలు కనబడితే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇది మరెక్కడో కాదు తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి అంగన్​వాడీ కేంద్రంలో చోటు చేసుకుంది. ఇక్కడి అంగన్వాడీ కేంద్రంలో పాములు కలకలం సృష్టించాయి. నిన్న గదిని శుభ్రం చేస్తుండగా ఆయాకు రాళ్ళ మధ్యలో మొదటగా ఒక పాము కనపడింది.

స్థానికుల సాయంతో ఆ పామును చంపించింది. ఆ రాళ్లు అన్నీ తీయగా అందులో నుంచి వరుసగా 30 పాము పిల్లలు, 2 తేళ్లు బయటకు వచ్చాయి. ముందు కాస్త బిత్తరపోయిన అక్కడి స్థానికులు తర్వాత తేరుకుని వాటన్నింటినీ చంపి బయట పడేశారు. అయితే ఈ తతంగమంతా జరుగుతున్న సమయంలో అంగన్​వాడీ కేంద్రంలో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టు అయింది. భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో పాములు, తేళ్లు వస్తున్నాయి అని వెంటనే అక్కడి నుంచి అంగన్వాడీ కేంద్రాన్ని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news