హైదరాబాద్ శివార్లలో బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి !

-

హైదరాబాద్ శివారులో ఉన్న మేడ్చల్ జిల్లా బషీరాబాద్ లో ఒక విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందింది. ఎంఆర్ఐటీలో సివిల్ ఇంజినీరింగ్ చేస్తూ అక్కడే కృపా హాస్టల్ లో చంద్రిక అనే విద్యార్థిని ఉంటోంది. అయితే ఆమె హాస్టల్ భవనం మీద నుంచి దూకి చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన చంద్రిక మైసమ్మగూడ కృప హాస్టల్ లో ఉంటుంది, అక్కడ నుండి కాలేజ్ కి వెళ్లి వస్తోంది.

అయితే ఆమె హాస్టల్ మీద నుండి దూకిందా లేదా అనేది కూడా అనుమానమే ఎందుకంటే ఆమె డెడ్ బాడీని ఈ ఉదయం హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమె చంద్రిక అని గుర్తించారు. ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రధానిక అంచనాకు వచ్చారు పోలీసులు. ముందు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నా ప్రాథమిక దర్యాప్తులో సూసైడ్ చేసుకున్నట్టు గుర్తించారు. ఆమెకు రెండు మూడు సంవత్సరాలలో బ్యాక్ లాగ్స్ ఉన్నాయని, ఇప్పుడు నాలుగో సంవత్సరం పరీక్షలు దగ్గర పాడడంతో ఒత్తిడికి తట్టుకోలేక ఆమె సూసైడ్ చేసుకుందని చెబుతున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news