పోలీసులకి ఏదో అవుతుంది.. తుపాకీతో కాల్చుకున్న మరో అధికారి

-

జమ్ముకశ్మీర్​ శ్రీనగర్ సీఆర్​పీఎఫ్​కు చెందిన ఓ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్​ రైఫిల్​తో కాల్చుకున్నాడు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడ్డాడు.”ఈ రోజు ఉదయం సీఆర్​పీఎఫ్ 141వ​ బెటాలియన్​కు చెందిన ఇన్​స్పెక్టర్​ ఎం. దామోదర్ శ్రీనగర్ షెర్​గారి ప్రాంతంలోని యూనిట్ వద్ద సర్వీస్ రైఫిల్​తో తనను తాను కాల్చుకున్నాడు” అని సీఆర్​పీఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. తుపాకీ కాల్పుల శబ్దం వినిపించగానే అప్రమత్తమైన అధికారులు.. తనిఖీ చేయగా రక్తపు మడుగులో పడి ఉన్న దామోదర్​ను గుర్తించారు.

police
police

వెంటనే అతడిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా ఆ అధికారి వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం శ్రీనగర్​ డాల్​గేట్​ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. సీఆర్​పీఎఫ్​ 61వ బెటాలియన్​కు చెందిన కానిస్టేబుల్​ కూడా ఇలానే తన సర్వీస్​ రైఫిల్​తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news