మళ్ళీ మాట మార్చిన సోము.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమే !

-

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు సంబంధించి సోము వీర్రాజు మాట మార్చారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద ఇంకేమీ చేయలేమని చెప్పిన ఆయన ఇప్పుడు మళ్ళీ తాము దానికి వ్యతిరేకం అని ప్రకటించారు. అయితే విశాఖ ఉక్కు మీద కేంద్రానికి స్పష్టత ఉందని పేర్కొన్న ఆయన తాము దానికి వ్యతిరేకమేనని మరో ఉద్దేశం లేదని అన్నారు.

ఇప్పటికే ఈ అంశాన్ని ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకు వెళ్లామని అన్నారు. అలాగే ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమీ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రణాలికా సంఘం నుండి నిధులు 32 శాతం నుంచి 42 శాతానికి పెంచారని అన్నారు. స్థానిక సంస్థల నిధులను కేంద్రం ఏమాత్రం ఆప లేదని అన్నారు. ఆరు రకాల అంశాలను రాష్ట్రం గురించి కేంద్రం ఎప్పుడూ పరిశీలిస్తూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news