హుజురాబాద్ ఎన్నికల పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు షాకింగ్ కామెంట్స్…!

-

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్ లు చేశారు. సోము వీర్రాజు మాట్లాడుతూ…. ఓటర్లలో చైతన్యం వచ్చిందని బిజెపి నేతలు అంటున్నారని తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

అధికారం అడ్డంపెట్టుకుని సాగించే దాడులు.. ప్రలోభాలు, పంపకాలు ప్రజా చైతన్యం ముందు దిగదుడుపే అని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక దానిని నిరూపించింది అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా త్వరలో ఇలాంటి చైతన్యాన్ని ఆశిద్దాం అంటూ సోము వీర్రాజు కామెంట్ చేశారు. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్ లో బద్వేల్ ఉప ఎన్నికలలో మాత్రం బిజెపి ఘోరపరాజయం చూసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి 90 వేలకు పైగా మెజార్టీ రాగా బిజెపికి కేవలం 20 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి.

Read more RELATED
Recommended to you

Latest news