ఓరి దుర్మార్గుడా… తల్లినే చంపిన కన్నకొడుకు

-

నవమాసాలు మోసిన కన్నతల్లినే కడతేర్చాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం రాజాపేట సమీపంలో దారుణం జరిగింది. కన్నకొడుకే తల్లిని బ్లేడుతో గొంతుకోసి హత్య చేశాడు. పోలీసులు కథనం ప్రకారం.. రాజాపేటకు చెందిన దార్ల వీరయ్య 20 సంవత్సరాలుగా సత్తెనపల్లిలో నివాసం ఉంటున్నాడు. 4 సంవత్సరాల క్రితం రాజాపేట నుంచి తల్లి ఆదిశేషమ్మ(67)ను సత్తెనపల్లిలోని తన వద్దకు తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు.. ఆదివారం తెల్లవారుజామున నిందితుడు తల్లి గొంతుకోసాడు. ఆమెను రాజాపేట- పోతవరం మధ్య ఓగేరు వాగు వంతెనపై వదిలేసి వెళ్ళాడు‌. గొంతు తెగిపోయిన ఆదిశేషమ్మ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకొని ఆమెను గుంటూరు జీజీహెచ్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదిశేషమ్మ మృతి చెందింది. దీనిపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఈ హత్యకు ఒడిగట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version