“సర్కారు వారి పాట”లో కూడా ఓ పాట లేపేశారు !

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ‘మహానటి’ కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ పిక్చర్ ఈ నెల 12న విడుదల కానుంది. మహేశ్ తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ పిక్చర్ లో కనిపించారు. ఈ క్రమంలోనే మహేశ్ ను చూసేందుకు మహేశ్- కృష్ణ అభిమానులు రెడీ అయిపోయారు.

థియేటర్ల వద్ద సందడి షురూ అయింది. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ డెఫినెట్ గా హిట్ అవుతుందని మహేశ్ అశేష అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో అన్ని పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

లేటెస్ట్‌ గా వచ్చిన మమ మహేష్‌.. పాట కూడా మాస్‌ ను ఆకట్టుకుంది. ఐతే నిజానికి సినిమాలో మొదట ఈ పాట లేదు. ఈ పాట స్థానంలో ఒక మెలోడీ సాంగ్‌ చేశాడు థమన్‌. పాట షూటింగ్‌ కూడా చేశారు. ఐతే ఫ్లోలో చూస్తే సెట్‌ కాలేదు. దీంతో మహేష్‌ మంచి ఊపు ఉన్న పాట కావాలని కోరడం, అప్పటి కప్పుడు మమ మహేష్‌ కంపోజ్‌ చేసి స్పెషల్ గా ఓ భారీ సెట్‌ నున వేసి షూట్‌ చేయడం జరిగింది. ఈ విషయాన్ని మహేష్‌ బాబు కూడా ఒప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news