రెడ్‌మీ ఇండియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సోనూ సూద్‌..!

-

క‌రోనా నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టుడు సోనూసోద్ ఎంతో మందికి ఎన్నో విధాలుగా స‌హాయం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారికి చేయూత‌ను అందించాడు. ఇత‌ర రాష్ట్రాల నుంచి సొంత రాష్ట్రాల‌కు వెళ్లిపోయే వ‌ల‌స‌కూలీల‌ను త‌న ఖ‌ర్చుల‌తో వారి స్వ‌గ్రామాల‌కు పంపించాడు. ఇలా ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టాడు. దీంతో 2020లో సోనూసూద్‌కు వ‌చ్చిన పాపులారిటీ భార‌త్‌లో ఎవ‌రికీ రాలేద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే సోనూసూద్ ప్ర‌స్తుతం రెడ్‌మీ ఇండియాకు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయ్యాడు.

sonusood as redmi india brand ambassador

సోనూసూద్‌ను త‌మ కంపెనీకి ప్ర‌చార క‌ర్త‌గా నియ‌మించుకున్న‌ట్లు రెడ్‌మీ ఇండియా తెలిపింది. ఎంఐ ఇండియాకు చెందిన స‌బ్ బ్రాండ్ రెడ్‌మీ ఇండియా కాగా.. ఇటీవ‌లే విడుద‌ల చేసిన రెడ్‌మీ 9 ప‌వర్ ఫోన్‌తో సోనూసూద్ అప్పుడే ఓ యాడ్‌లో కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను రెడ్‌మీ ఇండియా విడుద‌ల చేసింది.

సోనూసూద్ 2020లో ఎంతో మందికి స‌హాయం అందించారు. ఆయ‌న ఎంతో మందికి ప్రేర‌ణ ఇచ్చారు. ఆయ‌న స్పూర్తితోనే క‌రోనా వ‌ల్ల ఎఫెక్ట్ అయిన పేద విద్యార్థుల‌కు గ‌తంలో 2500 ఫోన్ల‌ను ఆన్‌లైన్ విద్య కోసం అందించాం. ఇక‌పై కూడా సోనూసూద్‌తో క‌లిసి ఇలాంటి కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తాం. అందుక‌నే ఆయ‌న‌ను మా కంపెనీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకున్నాం.. అని రెడ్‌మీ ఇండియా తెలియ‌జేసింది.

ఈ సంద‌ర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. దేశంలో ఉన్న పేద విద్యార్థులంద‌రికీ విద్యను అందించాల‌న్నదే నా ల‌క్ష్యం. అందుకు షియోమీ మ‌ద్ద‌తు ప‌లికింది. శిక్షా హ‌ర్ హాత్ కార్య‌క్రమం కింద పేద విద్యార్థుల‌కు స‌హాయం చేస్తోంది. అందులో నేను కూడా భాగం కావ‌డం సంతోషంగా ఉంది.. అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news