చనిపోయిన తర్వాత సెక్స్‌ చేశారు : వికారాబాద్‌ కేసుపై ఎస్పీ కోటి రెడ్డి వివరణ

-

మైనర్ బాలిక హత్య అత్యాచారం కేసు లో ప్రేమికుడే నిందితుడు మహేందర్ అని వికారాబాద్ ఎస్పీ కోటి రెడ్డి వివరణ ఇచ్చారు. 28 న ఉదయం అంగడి చిట్టెంపల్లి లో మైనర్ బాలికపై అత్యాచారం హత్య చేసినట్టు పిర్యాదు అందిందని.. ఇందుకోసం టీమ్స్ ఫామ్ చేసాము.. 48 గంటలు లో నిందితుడిని గుర్తించామన్నారు. మహేందర్ అనే వ్యక్తి నేరానికి పాల్పడ్డాడు..హత్య చేసినట్టు మహేందర్ ఒప్పుకున్నాడని.. ఇద్దరికి సంవత్సర కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలిపారు.

ఈ ప్రేమ వ్యవహారం హత్యకు రెండు రోజుల ముందు మృతురాలి చెల్లెలకు తెలిసింది..మృతురాలి చెల్లి ఈ విషయం ఇంట్లో చెప్పిందని.. ఆయన తెలిపారు. దింతో తల్లి మందలించింది.. ఇక బయట కలుసు కోవడం కుదరదని భావించి హత్యకు ముందు రోజు కాల్ చేసి మాట్లాడుకున్నారని.. ఇద్దరం బయట కలుద్దాం అని మాట్లాడుకున్నారని చెప్పారు. అందులో భాగంగానే ఉదయం మూడు నాలుగు గంటల ప్రాంతంలో బయటకు వచ్చిందని.. మృతురాలిని తనతో ఫిజికల్ గా కలవాలి అంటూ మహేందర్ బలవంత పెట్టాడని ఎస్పీ తెలిపారు.

బాలిక గట్టిగా ప్రతిఘటించింది..దింతో మహేందర్ ఆమెకు పెనుగులాట జరిగిందన్నారు. ఈ పెనుగులాటలో బాలిక ను తోయడంతో ఆమె తల పక్కనే ఉన్న చెట్టుకు బలంగా తాకింది.దింతో బాలిక మృతి చెందిందని వెల్లడించారు. అది గమనించకుండా మహేందర్ ఆమెపై హత్యాచారం చేసాడని..అత్యాచారం అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని తెలిపారు ఎస్పీ కోటి రెడ్డి. నిందితుడిని నేడు కోర్టులో హాజరు పరుస్తాం…ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news