తిరుమలలో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం!

-

తిరుమల.. కలియుగ వైకుంఠం. నిత్యం లక్షలాదిమంది భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అయితే వారిలో వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లులు కూడా ఉంటారు. వారు అందరిలాగా క్యూలైన్‌లో నిలబడి స్వామి దర్శనం చేసుకోవాలంటే కష్టం. కాబట్టి వారికి ప్రత్యేక దర్శనం కల్పించాలని టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. అయితే ఈ దర్శనాన్ని మరింత సౌకర్యవంతంగా చేసేందుకు టీటీడీ కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలు…వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వీరికి టీటీడి ప్రత్యేకదర్శనం కల్పిస్తోంది. 4వేల టోకెన్లను ప్రత్యేకంగా వీరి కోసం కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడి శ్రీవారి భక్తులను కోరింది.

టికెట్ల జారీ ఎక్కడంటే!
ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతిరోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడి తెలిపింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 5 సంవత్సరాల లోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణరోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శనభాగ్యం కల్పిస్తారు.
-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news