Special Trains : సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌- బరంపురం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు

-

సంక్రాంతి పండగ వస్తున్న సందర్భంగా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ నెల 12 నుంచి 20 వరకు టైమ్‌టేబుల్‌ వారీగా హైదరాబాద్‌-బరంపురం, సికింద్రాబాద్‌-బరంపురం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు.

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ఆధ్వర్యంలో గిద్దలూరు-జగ్గంబొట్ల కృష్ణాపురం రైల్వే స్టేషన్ల మధ్య రెండో రైల్వే లైను పనులతో పాటు విద్యుద్ధీకరణ పూర్తి కావడంతో వాటిని శుక్రవారం ప్రారంభించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గుంటూరు-గుంతకల్‌ డబ్లింగ్‌, విద్యుద్ధీకరణ ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు పూర్తయినట్లు తెలిపారు. ఈ రెండు స్టేషన్ల మధ్య 401 కిలోమీటర్ల దూరం పని ఉండగా అందులో 26.4 కిలోమీటర్ల మేరకు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 2016-17లో రూ.3887 కోట్లు అంచనా వ్యయంతో నిధులు మంజూరయ్యాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news