Vunnamatla eliza: వైసీపీ నుంచి టిక్కెట్ కోసం అమరావతిలోనే ఎమ్మెల్యే మకాం.. ఉత్కంఠ..

-

ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో నేతలు టిక్కెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చింతలపూడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వున్నమట్ల ఏలిజా అమరావతిలోనే మాకాం వేశారు.చింతలపూడి లో మొదటి, రెండవ లిస్టులో సీటు మార్పు లేకపోవడంతో ఎవరి పేరు ఖరారు అవుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి చింతలపూడి సీటు విషయాన్ని వైసీపీ అధిష్ఠానం ఖరారు చేయనున్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు.

సీటు తనదేనంటూ విజయరాజు ఇప్పటికే నియోజకవర్గంలో వైసీపీ పెద్దలను కలుస్తున్నారు. టిక్కెట్ పంచాయితీ ఎటూ తేలక పోవడంతో చింతలపూడి వైసీపీ నేతలు అమరావతిలోనే మకాం వేశారు.వైసీపీ సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా చింతలపూడి నుంచే ఏలిజా పోటీ చేస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. వైసీపీ సీటు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు ఏలిజా సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news