ముంబైకి పాండ్యా కెప్టెన్సీ…. sky గుండె బద్దలు… వైరల్ అవుతున్న పోస్ట్

-

వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టుకి హార్థిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించబోతున్నారు. ఇంతకుముందు గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ ని ముంబై ట్రేడింగ్ ఆప్షన్ ద్వారా మరల కొనుగోలు చేసింది. ఈ కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారం రేపుతుంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ ని ఐదు సార్లు విజేతగా నిలిపినటువంటి రోహిత్ శర్మాని కాదని పాండ్యా కి సారథ్యా బాధ్యతలు అందించడం అందరిని విస్మయానికి గురిచేసింది.

అయితే తాజాగా సూర్య కుమార్ యాదవ్ ఇన్స్టాగ్రాములో హార్ట్ బ్రేక్ ఇమేజ్ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ చూసిన కొందరు అభిమానులు అది రోహిత్ శర్మాన్ని సారత్య బాధ్యతల నుంచి తప్పించడం మూలంగానే అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అయితే సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ ని ఆశించడం వల్లే ఆ పోస్టు పెట్టాడని అంటున్నారు. ఐపీఎల్ మొదట్లో ముంబై తరఫున ఆడిన సూర్యాని 2014లో కోల్కత్తా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ దక్కించుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇతనిని 2018 లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news