‘బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే’… సాక్షి ధోనీ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌

-

చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై చెన్నై 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ నాలుగో పరాజయాన్ని చవి చూసింది. ఈ మ్యాచ్లో చెన్నై నిర్దేశించిన 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సన్రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. చెన్నై బౌలర్ తుషార్ దేశ్పాండే పవర్ ప్లేలోనే హైదరాబాద్ జట్టును శాసించాడు.

16 ఓవర్లకే హైదరాబాద్‌ కీలకమైన వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ భార్య సాక్షి ధోని ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టింది. ఈ పోస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

‘‘ప్లీజ్‌ ఇవాళ మ్యాచ్‌ను త్వరగా ముగించండి. బేబీ ఈజ్‌ ఆన్‌ ది వే. కాబోయే అత్తగా నా రిక్వెస్ట్‌ ఇదే’’ అని సాక్షి తన ఇన్‌స్టా గ్రామ్‌ స్టోరీస్‌ పెట్టింది. దీంతో ధోనీ అభిమానులంతా ధోనీ.. మామ కాబోతున్నాడంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news