ఒక్కసారిగా బస్సులో చెలరేగిన మంటలు.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

-

ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా తెలంగాణ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులకు పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

A sudden fire broke out in the bus

తిరుపతి నుంచి హైదారాబాద్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా సూరరెడ్డి పాలెం వద్దకు రాగానే బస్సు ఇంజన్‌లో మంటలు రావటం చూసిన డ్రైవర్.. బస్సు సైడ్‌కి ఆపి ప్రయాణికులను బస్సు నుంచి కిందకు దింపాడు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక బస్సుకు జరిగిన ప్రమాదంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news