BREAKING: వెస్ట్ ఇండీస్ టీ 20 లకు ఇండియా జట్టు ఇదే.. !

-

ఐపీఎల్ అనంతరం ఇండియా ఆడిన వరల్డ్ ఛాంపియన్ షిప్ టెస్ట్ ఫైనల్ లో ఓటమి పాలయింది. అనంతరం వెస్ట్ ఇండీస్ గడ్డపైన టెస్ట్ లు, వన్ డే లు మరియు టీ 20 లు ఆడడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే టెస్ట్ మరియు వన్ డే జట్లను ప్రకటించిన బీసీసీఐ, తాజాగా టీ 20 జట్టును కూడా ప్రకటించింది. బీసీసీఐ సెలక్షన్ ప్రకారం ఈ టీ 20 లకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్ గా నియమించింది. ఇంకా జట్టులో మిగిలిన ఆటగాళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఇండియా టీం : హార్దిక్ పాండ్య కెప్టెన్ , ఇషాన్ కిషన్, శుబ్మాన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ ఖాన్ మరియు ముఖేష్ కుమార్ లను బీసీసీఐ ప్రకటించింది.

ఇక ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన యశస్వి జైస్వాల్ , తిలక్ వర్మ, సంజు శాంసన్, ముఖేష్ కుమార్ లకు ఈ టూర్ చాలా మంచి అవకాశం అని చెప్పాలి. మరి ఈ టూర్ లో రాణించి తమ స్థానాన్ని ఎక్కువ కాలం పదిలపరుచుకుంటారా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news