రికార్డు సృష్టించిన బోపన్న జోడీ.. ఏటీపీ టైటిల్ కైవ‌సం

-

ఆడిలైడ్ ఇంటర్నేష‌న‌ల్ టెన్నిస్ టోర్న‌మెంట్ లో భార‌త్ నుంచి పాల్గొన్న రోహాన్ బోపన్న – రామ్ కుమార్ రామ నాథ‌న్ జోడీ రికార్డు సృష్టించింది. ఆదివారం జ‌రిగిన ఏటీపీ టోర్నీ డ‌బుల్స్ ఫైన‌ల్ మ్యాచ్ లో బోప‌న్న – రామ్ కుమార్ రామ నాథ‌న్ జోడీ విజ‌యం సాధించింది. టెన్నిస్ లో టాప్ సీడ్ జంట అయిన ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) – మార్సెలో మెలో ( బ్రెజిల్) ను ఓడించారు. 7-6, (6) 6-1 తేడాతో ప్ర‌త్య‌ర్థుల‌ను బోప‌న్న – రామ్ కుమార్ రామ నాథ‌న్ మ‌ట్టి క‌రిపించారు.

దీంతో ఏటీపీ డ‌బుల్స్ టైటిల్ ను కైవ‌సం చేసుకున్నారు. కాగ బోపన్న తో రామ్ కుమార్ రామ నాథ‌న్ తొలి సారి జ‌ట్టు క‌ట్టాడు. కాగ ఈ విజ‌యంతో బోపన్న ఖాతాలో 20 ఏటీపీ టైటిల్స్ చేరాయి. అలాగే రామ్ కుమార్ రామ నాథ‌న్ కు ఇదే మొదటి ఏటీపీ టైటిల్ కావ‌డం విశేషం. కాగ ఈ టోర్నికి వెళ్లే ముందు నుంచి కూడా బోప‌న్న – రామ్ కుమార్ జోడీ టైటిల్ కొడుతుంద‌నే అంద‌రూ భావించారు. అంతే కాకుండా ఈ టోర్నీ లో ఈ జోడీయే హాట్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version