IND vs WI 2ND ODI : నేటి మ్యాచ్ లో సంజు శాంసన్ కు చోటు దక్కుతుందా … ?

-

ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ జట్ల మధ్యన ఈ రోజు సాయంత్రం 7 గంటకు రెండవ వన్ డే జరగనుంది. మొదటి మ్యాచ్ లో ఇండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. మూడు వన్ డే ల సీరీస్ లో భాగంగా ఈ రోజు ఇండియా మ్యాచ్ గెలిస్తే సీరీస్ ను గెలుచుకుంటుంది, ఒకవేళ వెస్ట్ ఇండీస్ కనుక గెలిస్తే సీరీస్ కోసం ఆఖరి మ్యాచ్ వరకు ఎదురు చూడక తప్పదు. కాగా గత మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 లో కొన్ని అనూహ్య మార్పులు ఆశించారు అభిమానులు. ముఖ్యంగా కేరళ ఆటగాడు సంజు శాంసన్0 ఎంతో కాలంగా రెగ్యులర్ ప్లేయర్ గా మారి ఇండియాకు విజయాలను అందించాలని ఎదురుచూస్తున్నాడు. కానీ ఇండియా యాజమాన్యం మాత్రం ఒక సీరీస్ లో ఒక మ్యాచ్ లో ఫెయిల్ అయితే.. ఇక ఛాన్స్ లు ఇవ్వటం ఆపేస్తున్నారు.

అంతగా ఫామ్ లో లేని సూర్య కుమార్ యాదవ్ ను మొదటి మ్యాచ్ లో ఆడించారు.. దీనితో అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. కనీసం ఈ రోజు అయినా ఇతనికి చోటు దక్కుతుందా ? లేదా అని చూడాలి .

Read more RELATED
Recommended to you

Latest news