విజృంభించిన భార‌త్ 85 కే చాప చూట్టిన స్కాట్లాండ్

-

స్కాట్లాండ్ తో జ‌రుగుతున్న టీ ట్వంటి మ్యాచ్ లో భార‌త్ బౌల‌ర్లు విజృంభించారు. బౌల‌ర్ల దాటికి స్కాట్లాండ్ ఏ మాత్రం త‌ట్టు కోలేక పోయింది. నిర్ణ‌త 20 ఓవ‌ర్ల ను కూడా స్కాట్లాండ్ ఆడ‌లేక పోయింది. 17.4 ఓవ‌ర్ల లోనే స్కాట్లాండ్ చాప చూట్టేసింది.

చివ‌రికి స్కాట్లాండ్ కేవ‌లం 85 పరుగులు మాత్ర‌మే చేయ‌క‌లిగింది. ఈ మ్యాచ్ లో మ‌హ్మ‌ద్ ష‌మీ, ర‌వీంద్ర జ‌డేజా విద్వంసం సృష్టించారు. ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను క్రిజ్ లో ఏ మాత్రం నిల‌వ‌కుండా చేశారు. బ్యాట‌ర్లు వ‌చ్చిన వెంట‌నే వ‌రుస‌గా పేవిలియ‌న్ కు పంపిచారు. ష‌మీ, జ‌డేజా పోటీ ప‌డుతూ తల 3 వికెట్లు తీసుకున్నారు. అలాగే బుమ్రా కూడా అద్భుత మైన బౌలింగ్ వేశాడు.

 

ఈ మ్యాచ్ లో బుమ్రా 2 వికెట్లు తీసుకున్నాడు. అలాగే ర‌వి చంద్ర‌న్ అశ్విన్ ఒక వికెట్ తిసుకున్నారు. దీంతో 85 ప‌రుగుల‌కే స్కాట్లాండ్ ఆల్ అవుట్ అయింది. దీంతో భారత్ ముందు 86 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యం ముందు ఉంది. అయితే భార‌త్ ఓపెన‌ర్లు విజృంభిస్తే 7 ఓవ‌ర్ల‌లో నే ఈ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news