టీమిండియా చెత్త ప్రదర్శన.. అహ్మదాబాద్‌ టీ20లో స్కోరు 124..

-

ఇంగ్లండ్‌తో ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్‌లో ఇరగదీసి ఆడిన టీమిండియా ఆ జట్టుతో శుక్రవారం జరుగుతున్న తొలి టీ20లో మాత్రం చతికిలపడింది. అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్‌ కోహ్లి సహా బ్యాట్స్‌మెన్లు అందరూ విఫలం అయ్యారు.

india made 124 for 7 in ahmedabad t20

మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోగా భారత్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి డకౌట్‌ అయ్యాడు. ఓపెనర్లు శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌లు వెంట వెంటనే ఔటయ్యారు. శ్రేయాస్‌ అయ్యర్‌ జట్టును ఆదుకున్నాడు. 48 బంతులు ఆడిన అయ్యర్‌ 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 67 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. రిషబ్‌ పంత్‌ (21 పరుగులు), హార్దిక్‌ పాండ్యా (19 పరుగులు)లు కొంత సేపు నిలదొక్కుకునే యత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. టీమిండియా తక్కువ స్కోరుకే పరిమితం కావల్సి వచ్చింది.

ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసిన ఆర్చర్‌ 1 మేడిన్‌తో 23 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్లు తీశాడు. అలాగే ఆదిల్‌ రషీద్‌, మార్క్‌ వుడ్‌, బెన్‌ స్టోక్స్‌లు కూడా తలా 1 వికెట్‌ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news