IPL DC vs PBKS : కుప్ప‌కూలిన పంజాబ్.. ఢిల్లీ టార్గెట్ 116

-

పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ‌ధ్య నేడు జ‌రుగుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ మ్యాచ్ లో టాస్ ఓడి.. బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కుప్ప‌కూలింది. ఢిల్లీ బౌల‌ర్ల దాటికి పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్లు.. క్రీజ్ లో నిల‌వ‌లేక పోయారు. ఒక్క‌రి త‌ర్వాత ఒక్క‌రు పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. దీంతో పంజాబ్ కింగ్స్ 115 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. జీతేష్ శ‌ర్మ (32), మ‌యాంక్ అగ‌ర్వాల్ (24) మాత్ర‌మే రాణించారు. ఢిల్లీ బౌల‌ర్ల ధాటి్ఇ ఏకంగా ఏడుగురు బ్యాట్స్ మెన్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే ప‌రిమితం అయ్యారు. ఈ ఇన్నింగ్స్ లో కేవ‌లం ఒకే ఒక్క సిక్స్ మాత్ర‌మే కొట్టారు.

దీంతో ఢిల్లీ బౌల‌ర్లు ఎంత హ‌డ‌లేత్తించారో తెలుస్తుంది. క‌లీల్ అహ్మ‌ద్, ల‌లీత్ యాద‌వ్, అక్షర్ ప‌టేల్, కుల్‌దీప్ యాద‌వ్ త‌లో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. ముస్తాఫిజ‌ర్ ర‌హ్మాన్ ఒక్క వికెట్ తీశాడు. కాగ ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజ‌యం సాధించాలంటే.. 116 ప‌రుగుల టార్గెట్ ఛేదిస్తే.. స‌రిపోతుంది. కాగ సూప‌ర్ ఫామ్ లో ఉన్న పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ బ్యాట్ ఝూలిపిస్తే.. భారీ తేడాతో గెలిచే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news