రెచ్చిపోయిన చెన్నై.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ తో 206 పరుగులు సాదించింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఓపెనర్ రచిన్ రవీంద్ర(46) వికెట్ తీసి పరుగులను కట్టడి చేశాడు. అయినప్పటికీ గైక్వాడ్ (46) పరుగులు చేశాడు. మిచెల్, శివం దూబే(51) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. శివం దూబే అర్ధసెంచరీ చేసి చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 20 ఓవర్లలో చెన్నై పరుగులు 206 చేసింది.

 

శివం దూబే ఔట్ అయిన  తరువాత వచ్చిన సమీర్ రిజ్వీ ఫస్ట్ బాల్ కే సిక్స్ బాదాడు. ఆ తరువాత 19వ ఓవర్ లో చివరి బంతికి మరో సిక్స్ బాదాడు రిజ్వీ. చివరి ఓవర్ మోహిత్ బ్రిలియంట్ ఓవర్ వేశాడు. దీంతో చెన్నై 206 పరుగులు చేసింది.  గుజరాత్  207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news