IPL 2022: ఢిల్లీని చిత్తు చేసిన గుజరాత్ టైటాన్స్‌

-

ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌ దుమ్ము లేపుతోంది. ఢిల్లీతో నిన్న జరిగిన రెండో మ్యాచ్‌ లోనూ విజయం సాధించింది హార్థిక్‌ పాండ్యా సేన. ఢిల్లీ పై 14 పరుగులతో నిన్నటి మ్యాచ్‌ లో గెలిచింది గుజరాత్‌. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

శుభ్‌ మన్‌ గిల్‌ హాఫ్‌ సెంచరీకి తోడుగా కెప్టెన్‌ పాండ్యా 31 పరుగులు చేసి.. రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజుర్, ఖలీల్‌ అహ్మద్‌ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ తీశాడు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్నీత 20 ఓవరల్లో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది.

కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ 43 పరుగులు, లలిత్‌ యాదవ్‌ 25 పరుగులు, చేశారు. అటు గుజరాత్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 4 వికెట్లు తీయగా.. షమీ 2 వికెట్లు తీశాడు. కెప్టెన్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అయితే..20 ఓవర్లలో ఢిల్లీ 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులే చేసింది. దీంతో 14 పరుగులతో ఢిల్లీపై గెలిచింది గుజరాత్‌.

Read more RELATED
Recommended to you

Latest news