IPL 2022 : ఐపీఎల్‌లో 250 వికెట్లు తీసి..చరిత్ర సృష్టించిన బుమ్రా

-

ఇండియా ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో బుమ్రా అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 250 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు బుమ్రా. అత్యధిక T20 వికెట్లు భారతీయులలో 250 వికెట్లతో జస్ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో నిలిచాడు. బుమ్రా తర్వాత.. 223 వికెట్లతో భువనేశ్వర్ కుమార్ రెండో స్థానంలో ఉన్నాడు. 201 వికెట్లతో జయదేవ్ ఉనద్కత్ మూడో స్థానంలో ఉన్నాడు.

194 వికెట్లతో వినయ్ కుమార్ నాలుగో స్థానంలో ఉండగా.. 173 వికెట్లతో ఇర్ఫాన్ పఠాన్ ఐదో స్థానంలో నిలిచాడు. కాగా.. నిన్నటి డూ ఆర్‌ డై మ్యాచ్‌ లో ముంబైపై హైదరాబాద్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది.

ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ లో ముంబై పై హైదరాబాధ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి.. 190 పరుగులకే పరిమితమైంది. రోహిత్‌ శర్మ 48 పరుగులు, ఇషాన్‌ కిషన్‌ 43 పరుగులు, డేవిడ్‌ 46 పరుగులు చేసి.. ధాటిగా ఆడటంతోఓ దశలో హైదరాబాద్‌ పై ముంబై విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. అయితే.. భువనేశ్వర్‌ 1 వికెట్, ఉమ్రాన్‌ మాలిక్‌ 3 వికెట్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడం కారణంగా హైదరాబాద్‌ విజయ పతాకం ఎగురవేసింది.

 

Read more RELATED
Recommended to you

Latest news