ముంబై ఇండియన్స్ టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్ జరుగుతున్న మ్యాచ్ ముంబై ఇండియన్స్ పేస్ గుర్రం జస్రీత్ బుమ్రా సంచలన బంతితో మెరిశాడు. అద్భతమైన యార్కర్ తో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత గుజరాత్ టైటాన్స్ ని బ్యాటింగ్ కి ఆహ్వానించాడు.

టాస్ గెలిచిన ఫీల్డింగ్ ఎంచుకుంది ముంబై ఇండియన్స్. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. ముంబై ఆటగాళ్లు 7 వికెట్లు తీశారు. బుమ్రా 4 వికెట్లను తీశాడు. కోటేజ్ రెండు వికెట్లను తీశాడు. పియూష్ చావ్లా 1 వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ శుబ్ మన్ గిల్ 31 పరుగులు చేయగా.. వృద్ధిమాన్ సాహా (19), సాయి సుదర్శన్ (45), తెవాటియా (22) మినహా మిగతా ఆటగాళ్లు ఎవ్వరూ పెద్దగా పరుగులు చేయలేదు. ముంబయి బౌలర్ల దాటికి వికెట్లను కోల్పోయారు. ముంబై జట్టు 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news