సురేష్ రైనాను చెన్నై కొనుగోలు చేశాక ధోనీ ఏమ‌న్నాడో తెలుసా..?

-

ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ స‌క్సెస్‌కు కెప్టెన్ ధోనీతోపాటు స్టార్ బ్యాట్స్‌మ‌న్ సురేష్ రైనా కూడా కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ఈ ఇద్ద‌రి వ‌ల్లే చెన్నై ఐపీఎల్‌లో విజ‌య ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తుంద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఈ ఇద్ద‌రూ త‌మ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఐపీఎల్‌లో చెన్నై జ‌ట్టులో మెరిశారు. అలాగే ద‌క్షిణాదిలో ఎంతో పాపుల‌ర్ అయ్యారు. వీరు మంచి స్నేహితులు కూడా.

do you know what dhoni said after raina purchased by chennai

2008లో ఐపీఎల్‌కు గాను ఆట‌గాళ్ల వేలం నిర్వ‌హించిన‌ప్పుడు ధోనీ భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ స‌మ‌యంలో చెన్నై ధోనీని ముందుగా వేలంలో 1.5 మిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసింది. అయితే అదే వేలంలో చెన్నై సురేష్ రైనాను 6.50 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు కొనుగోలు చేసింది. ఈ క్ర‌మంలో రైనాను చెన్నై కొనుగోలు చేశాక ధోనీ ఏమ‌న్నాడో సురేష్ రైనా ఓ పుస్త‌కంలో తెలిపాడు.

సురేష్ రైనాను వేలంలో చెన్నై కొనుగోలు చేశాక ధోనీ.. మ‌జా ఆయేగా దేఖ్‌.. అని రైనాతో అన్నాడు. ఈ విష‌యాన్ని రైనా బిలీవ్ అనే పుస్త‌కంలో తెలిపాడు. ఐపీఎల్ వేలంలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూశాన‌ని, త‌న‌ను చెన్నై టీమ్ కొన్నందుకు సంతోషంగా ఉంద‌ని, త‌న‌ను చెన్నై కొనుగోలు చేశాక ధోనీ అన్న మాట‌లు ఇప్ప‌టికీ గుర్తున్నాయ‌ని రైనా ఆ పుస్త‌కంలో తెలిపాడు. ఆ టీమ్‌కు మొద‌ట్లో మాథ్యూ హేడెన్‌, ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్, స్టీఫెన్ ఫ్లెమింగ్ లాంటి స్టార్ క్రికెట‌ర్లు ఆడార‌ని, వారితో క‌లిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవ‌డం సంతోషాన్నిచ్చింద‌ని రైనా ఆ బుక్‌లో తెలియ‌జేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news