ఇండియా విజయాలపై పాక్ మాజీ హాసన్ రాజా కీలక వ్యాఖ్యలు !

-

ఇండియా వేదికగా జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ లో ఇండియా అపజయం ఎరుగని జట్టుగా వరుస విజయాలతో దూసుకువెళుతోంది. ప్రస్తుతం ఇండియా ఉన్న ఫామ్ ను చూస్తే ఖచ్చితంగా కప్ ను గెలుచుకుంటుందన్న ఆశాభావాన్ని మాజీలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గెలుపును ప్రత్యర్థి దేశాల ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తాజాగా పాకిస్తాన్ కు చెందిన మాజీ ప్లేయర్ హాసన్ రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజా మాట్లాడుతూ, బీసీసీఐ బ్రాడ్ కాస్టర్ ల సాయంతో DRS ను మానిప్యులేట్ చేస్తోదంటూ ఆరోపించారు. ఇది మొదటిసారి లేదు 2011 లోనూ పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇలాగే చేసిందంటూ హాసన్ రాజా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కారణంగానే ఇండియా ఇక్కడ జరిగే ప్రతి వరల్డ్ కప్ లోనూ రాణిస్తోంది ఆ అంటూ సెన్సషనల్ కామెంట్స్ చేశారు హాసన్ రాజా.

ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది మాత్రమే కాదు హాసన్ రాజా ఇటీవల ఐసీసీ ఇండియాకు ప్రత్యేకమైన బంతులను ఇస్తోందంటూ ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news